
న్యూఢిల్లీ: సిటీ బ్యాంకు ఇండియా కన్జూమర్ బిజినెస్ను యాక్సిస్ బ్యాంకు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.12,325 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రెండు బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులు దీనికి ఆమోదం తెలిపాయి. కన్జూమర్ బిజినెస్లో క్రెడిట్కార్డ్స్, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కన్జూమర్ లోన్ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ డీల్లో సిటీ బ్యాంకు నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సిటీకార్ప్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్కూడా ఉంటుంది. ఇది కమర్షియల్ వెహికల్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, పర్సనల్ లోన్లు ఇస్తుంది. ఈ డీల్ వల్ల తమకు సంపన్న కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుందని యాక్సిస్ తెలిపింది. విలీనం తరువాత యాక్సిస్ బ్యాంకు సేవింగ్ అకౌంట్ల సంఖ్య 2.85 కోట్లకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు పెరుగుతుంది. ఇండియాలో కన్జూమర్ బ్యాంకింగ్ ఆపరేషన్లను అమ్మేస్తామని సిటీ బ్యాంకు గత ఏడాదే ప్రకటించింది. మొత్తం 13 దేశాల్లో కన్జూమర్ బిజినెస్లను వదులుకుంటున్నట్టు తెలిపింది. యాక్సిస్ బ్యాంకుతోపాటు కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్, డీబీఎస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సిటీ బ్యాంకు కన్జూమర్ బిజినెస్ కొనుగోలుకు ఆసక్తి చూపాయి. సిటీ బ్యాంకు రిటైల్ బుక్ విలువ రూ.68 వేల కోట్ల వరకు ఉంటుంది. కార్డుల మార్కెట్లో నాలుగుశాతం వాటా ఉంది.