2.3 అడుగుల వ్యక్తికి వివాహం

2.3 అడుగుల వ్యక్తికి వివాహం

అతని ఎత్తు 2.3 అడుగులు మాత్రమే. తక్కువ ఎత్తు ఉండడంతో పెళ్లి కావడం లేదు. ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చాలాకాలంగా బాధ పడిపోయాడు. చివరకు తనకు పెళ్లి చేసుకోవాలంటూ 2019లో ప్రభుత్వ అధికారులను కలసి తన ఆవేదన వెలిబుచ్చాడు. అయినా.. ఫలితం లేకపోవడంతో సీఎం అఖిలేశ్ యాదవ్ ను కలిసి తనకు వధువును వెతికి పెట్టాలని అభ్యర్ధించాడు. అప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దేశ వ్యాప్తంగా వీడియోలు వైరల్ అయ్యాయి. అతనే అజీం మన్సూరీ.

ప్రస్తుతం అతని కల నెరవేరబోతోంది. అజీంకు పెళ్లి కుదిరింది. పెళ్లి బట్టలు కుట్టించుకున్న ఫొటో వైరల్ అయ్యింది. హాపూర్ లోని బుషారా మూడు అడుగుల అమ్మాయితో తనకు నిశ్చితార్థం జరిగిందని.. నవంబర్ 07న వివాహం చేసుకోబోతున్నట్లు అజీం వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీకి శుభలేఖలు అందిస్తానని తెలిపారు. త్వరలో ఢిల్లీకి వెళ్తానని, పెళ్లికి బట్టలు కుట్టించుకుంటున్నానన్నాడు. బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందన్నాడు. ప్రస్తుతం ఇతనికి ఓ కాస్మోటిక్ స్టోర్ ఉంది.