అజ్మీర్​ దర్గాకు చాదర్​సమర్పించిన అజారుద్దీన్

అజ్మీర్​ దర్గాకు చాదర్​సమర్పించిన అజారుద్దీన్

జూబ్లీహిల్స్​,వెలుగు:  పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్,​ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ​ఇన్ చార్జ్ మహ్మద్​అజారుద్దీన్ అజ్మీర్ ​దర్గాకు చాదర్​​సమర్పించారు. మంగళవారం గాంధీభవన్​లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్  దీపాదాస్​ మున్షితో కలిసి  పాల్గొన్నారు.  ప్రతి ఏటా అజ్మీర్​కు చాదర్ ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అజారుద్దీన్  పేర్కొన్నారు.

 ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి  రావడంతో తాను మొక్కు చెల్లించుకున్నట్లు  తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ​యూత్​ లీడర్​మహ్మద్​అసదుద్దీన్,  టీ పీసీసీ జనరల్​సెక్రటరీ సయ్యద్​అబ్దుల్​ఫహీమ్​ఇతర కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.