జూబ్లీహిల్స్,వెలుగు: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ మహ్మద్అజారుద్దీన్ అజ్మీర్ దర్గాకు చాదర్సమర్పించారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఏటా అజ్మీర్కు చాదర్ ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అజారుద్దీన్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తాను మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ లీడర్మహ్మద్అసదుద్దీన్, టీ పీసీసీ జనరల్సెక్రటరీ సయ్యద్అబ్దుల్ఫహీమ్ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.