- ఎనిమిది మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్
- మరో 15 మంది ఈఈలకు ఎస్ఈలుగా పదోన్నతి
హైదరాబాద్, వెలుగు: సాగునీటి శాఖలో ప్రమోషన్ల జోరు కొనసాగుతున్నది. తాజాగా మరో 23 మంది అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డిపార్ట్మెంటల్ ప్రమోషన్కమిటీ (డీపీసీ) మీటింగ్నిర్వహించి.. సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చింది. ఎనిమిది మంది సూపరింటెండెంట్ఇంజనీర్ (ఎస్ఈ)లకు చీఫ్ ఇంజనీర్లు(సీఈ) గా,15 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లకు ఎస్ఈలకు ప్రమోషన్లు కల్పించినట్టు తెలిసింది. ఈ పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈఎన్సీ అడ్మిన్ తమటం శ్రీనివాస్ మంగళవారం రిటైర్ కాగా.. ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించినట్టు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో ప్రమోషన్లే లేవ్..
బీఆర్ఎస్హయాంలో పదేండ్లలో ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లన్నవే లేకుండా పోయాయి. అధికారంలో ఉన్నన్నాళ్లూ కేవలం ఎఫ్ఏసీలు ఇచ్చి కాలం నెట్టుకుంటూ వచ్చారు. దీంతో ఇరిగేషన్శాఖ అస్తవ్యస్తమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్మెంట్ను స్ట్రీమ్లైన్ చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. అధికారుల ప్రమోషన్లకు నిరుడు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ఆగస్టు నుంచి ప్రమోషన్లను ఇస్తూ వచ్చింది. అవసరమైన చోట మాత్రం కొందరు అధికారులకు ఎక్స్టెన్షన్లూ ఇచ్చింది. తొలుత నిరుడు ఆగస్టు 5న 8 మంది ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్లను కల్పించింది.
తొలి దశలో డీపీసీలో 13 మంది పేర్లను క్లియర్ చేయగా.. మొదట 8 మందికి, ఆ తర్వాత ఆగస్టు 29న మరో ఇద్దరికి సీఈలుగా పదోన్నతిని కల్పించింది. ఇక అదే నెల 8న భారీ సంఖ్యలో అధికారులకు ప్రమోషన్లను ఇచ్చింది. ఒకేసారి 169 మందికి పదోన్నతులను కల్పించింది. 46 మంది డీఈఈలకు ఈఈలుగా ప్రమోషన్లను అందించింది. 2008 బ్యాచ్ ఏఈఈలు ఎప్పటి నుంచో ప్రమోషన్లకు నోచుకోలేదు. ఆ డీపీసీలో వారికి కూడా అవకాశం కల్పించింది. అందులో 123 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఇలా ఇప్పటిదాకా 200 మందికిపైగా అధికారులకు ప్రభుత్వం ప్రమోషన్లను కల్పించడం విశేషం.
