న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ సస్పెన్షన్ను విధించాలని స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియా.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు విజ్ఞప్తి చేశాడు. సంజయ్ సింగ్ నేతృత్వంలోని కార్యవర్గాన్ని తిరిగి కొనసాగించడం వల్ల రెజ్లర్లను బెదిరింపులు, వేధింపుల్లో పడేసిందన్నాడు.
‘రకరకాలుగా అన్యాయానికి గురైన ఇండియా అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని మేం అభ్యర్తిస్తున్నాం. ఇండియా రెజ్లర్లు న్యాయం, హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియాలో క్లీన్ అండ్ ఫెయిర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కు మద్దతివ్వాలన్న మా రిక్వెస్ట్ను మీరు పరిశీలిస్తారని, డబ్ల్యూఎఫ్ఐపై అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని పూనియా లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ కాపీని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్కు కూడా పంపాడు.