Balagam: దిల్ రాజు, ప్రియదర్శి ట్రాక్టర్ లో ర్యాలీ

Balagam: దిల్ రాజు, ప్రియదర్శి  ట్రాక్టర్ లో ర్యాలీ

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ లో త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీని విడుదల చేయటానికి దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ముందుగా యాత్రలు చేస్తున్నారు. ఇవాళ సినిమా యూనిట్ దిల్ రాజుతో కలిసి నిజామాబాద్ లో సందడి చేశారు.

బలగం సినిమా యూనిట్ మొత్తం ఒక బలగంగా వెళ్లి.. దిల్ రాజు సొంత గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఆనంతరం గ్రామ ప్రేక్షకులతో కలిసి టాక్టర్ లో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో దిల్ రాజు, అతని సతీమణి తేజస్విని, వేణు, ప్రియ దర్శి, హీరోయిన్ కావ్య పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న ఈ సినిమాకు భీమ్స్‌ మ్యూజిక్‌ అందించాడు. ఈ చిత్రంలో సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.