లోక్సభ ఎన్నికల్లో వాడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తనిఖీ చేయాలని, అందుకోసం రాజ్యాంగబద్ధ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానంతోనే దాన్ని కాపాడుకోగలమన్నారు. సోమవారం కోల్కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మాట్లాడారు. దేశంలో జరగబోయే అన్ని ఎన్నికల్ని బ్యాలెట్ విధానంలోనే జరపాలన్న డిమాండ్తో ఉద్యమం చేపడతానన్నారు. తమతో కలిసిరావాలని23 ప్రతిపక్ష పార్టీలకు పిలుపిచ్చారు.
బీజేపీ ఆఫీస్కు టీఎంసీ రంగుపూసిన దీదీ...
నార్త్పరగణ జిల్లాలోని బీజేపీ ఆఫీసు వద్ద మమత హల్చల్ చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్లో బీజేపీ హింసకు పాల్పడటాన్ని నిరసిస్తూ మే 30న దీదీ నిహాటీలో ధర్నా చేశారు. తర్వాత స్థానిక బీజేపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికెళ్లి, కాషయం రంగులో ఉన్న గోడపై తృణమూల్ పార్టీ పేరు, మూడు పువ్వుల సింబల్ని చిత్రించారు.