- రేస్ వాకర్లు అక్ష్దీప్, ప్రియాంక కూడా
న్యూఢిల్లీ : రోయింగ్లో పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఇండియా తొలి రోయర్గా బాలరాజ్ పన్వార్ రికార్డు సృష్టించాడు. సౌత్ కొరియాలోని చుంగ్జూలో ఆదివారం జరిగిన వరల్డ్ ఆసియా–ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగట్టాలో పోటీపడ్డ బాలరాజ్ మెన్స్ సింగిల్ స్కల్
ఈవెంట్లో మూడో స్థానం సాధించడం ద్వారా పారిస్ బెర్తు సాధించాడు. ఇండియా మిక్స్డ్ టీమ్ రేస్ వాకర్లు అక్ష్దీప్, ప్రియాంక టర్కీలోని అంటాల్యాలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రేస్ వాకింగ్ టీమ్ చాంపియన్షిప్లో 18వ స్థానంలో నిలిచి పారిస్ బెర్త్ దక్కించుకున్నారు.