
పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుతో పాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్.. గ్రామాల అభివ్రుద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమన్నారు. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ వరకు పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరగడం బాధాకరమన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై అలవాటుగా మారాయన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనో ధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఖచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో తెలిపారు బండి సంజయ్.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలి. ఇదే విషయమై @TelanganaCMO కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. pic.twitter.com/CYQofgl8Qi
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2022