సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుతో పాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్.. గ్రామాల అభివ్రుద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమన్నారు. పారిశుధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ వరకు  పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరగడం బాధాకరమన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై అలవాటుగా మారాయన్నారు.  పంచాయతీ కార్యదర్శుల్లో మనో ధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఖచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో తెలిపారు బండి సంజయ్.

బల్మూరిపై గాడిద దొంగతనం కేసు.. అర్ధరాత్రి అరెస్ట్

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరి శిక్ష

నిలువెత్తు బంగారం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి