- బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా
ఢాకా: కరోనా టైంలో ఇండియా ఎంతో సాయం చేసిందని, ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యాక్సిన్ ఇచ్చి చాలా మంది ప్రాణాలను కాపాడిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన టైంలో కూడా బంగ్లాదేశీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చిందని గుర్తుచేశారు. సోమవారం షేక్ హసీనా ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియా చేసిన హెల్ప్ను గుర్తు చేశారు. ‘‘వ్యాక్సిన్ మైత్రి” ప్రోగ్రాం లాంచ్ చేసి పొరుగున ఉన్న అన్ని దేశాలకు సాయం చేసిందని కొనియాడారు.
పోలెండ్ నుంచి తీసుకొచ్చారు..
రష్యా–ఉక్రెయిన్ వార్ టైంలో పోలెండ్లో చిక్కుకుపోయిన బంగ్లాదేశ్ స్టూడెంట్లను ఇండియా స్వదేశానికి చేర్చిందని ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఈ సాయం ఎప్పటికీ మరిచిపోలేమని, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వివరించారు. రెండు దేశాల మధ్య ఎంత బలమైన ఫ్రెండ్షిప్ ఉందో.. దీంతోనే అర్థం అవుతుందన్నారు.
రోహింగ్యాలతో అంతర్గత సవాళ్లు
రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో మంచి సహాయ సహకారాలు ఉన్నాయని ప్రధాని షేక్ హసీనా గుర్తు చేశారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని చర్చలతో పరిష్కరించుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. 1971 వార్లో ఎంతో హెల్ప్ చేసిందని, ఈ యుద్ధంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయానని గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో 10లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారని, వారితో అంతర్గతంగా సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వారు స్వస్థలాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇతర దేశాలతో చర్చిస్తున్నామని వివరించారు. ఇండియా పెద్ద దేశమని, కొంతమంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చని అన్నారు.