
నేపియర్ : చిన్న టార్గెట్ ఛేదనలో లిటన్ దాస్ (42 నాటౌట్) రాణించడంతో.. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్కు షాకిచ్చింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో బంగ్లా 1–0 లీడ్లో నిలిచింది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 134/9 స్కోరుకే పరిమితమైంది. జేమ్స్ నీషమ్ (48), మిచెల్ సాంట్నెర్ (23) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. షోరిఫుల్ ఇస్లామ్ 3, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో 137/5 స్కోరు చేసి నెగ్గింది. సౌమ్య సర్కార్ (22), నజ్ముల్ షాంటో (19), తౌహిద్ హ్రిదోయ్ (19), మెహిదీ హసన్ (19 నాటౌట్) నిలకడగా ఆడారు. మెహిదీ హసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం మౌంట్ మంగానుయ్లో జరుగుతుంది.