
- ఆఫీసర్ల తనిఖీలో బయటపడ్డ బ్యాంక్ మేనేజర్ నిర్వాకం
ధర్మసాగర్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి తాను పని చేసే బ్యాంక్లో రూ.73 లక్షల లోన్ తీసుకున్న బ్యాంక్ మేనేజర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆర్కల సురేశ్.. తన బంధువుల పేరు మీద అదే బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేశాడు.
ఆ తరువాత బంగారు ఆభరణాలు తనఖా పెట్టకుండానే నకిలీ పత్రాలు సృష్టించి సుమారు రూ.73 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నాడు. అధికారులు తనిఖీ చేయగా మేనేజర్ సురేశ్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గతంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో, వాటిపై బ్యాంకు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.