హైదరాబాద్, వెలుగు: రీజినల్ రూరల్ బ్యాంక్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ప్రకటించింది. ఇందుకుగాను ఈ నెల 22 నుంచి జరగాల్సిన ఆర్ఆర్బీ ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ను వాయిదా వేసింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ను వెల్లడిస్తామని తెలిపింది. ఆగస్టులో జరిగిన ఆర్ఆర్బీ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షను స్థానిక భాషలు లేకుండా ఇంగ్లిష్, హిందీలోనే నిర్వహించడంతో కర్నాటకలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో దిగొచ్చిన ఐబీపీఎస్ ముందుగా తెలిపిన విధంగా 13 లోకల్ లాంగ్వేజ్ల్లోనూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తెలిపింది.