మంచిర్యాల టికెట్​ బీసీలకే ఇవ్వాలి.. బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో దీక్ష 

మంచిర్యాల టికెట్​ బీసీలకే ఇవ్వాలి.. బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో దీక్ష 

మంచిర్యాల, వెలుగు: రానున్న ఎన్నికల్లో మంచిర్యాల టికెట్​ను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలని డిమాండ్​చేస్తూ బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఆమ్​ఆద్మీ పార్టీల నాయకులతో పాటు ప్రైవేట్ ​స్కూల్స్, ప్రైవేట్​డిగ్రీ కాలేజీల మేనేజ్​మెంట్లు, బార్​అసోసియేషన్, భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు.

ఎమ్మెల్యే ఆశావహ నాయకులు మంచిర్యాల మున్సిపల్​వైస్​ చైర్మన్ ​గాజుల ముఖేశ్​గౌడ్, డాక్టర్లు పూజారి రమణ, బి.రఘునందన్, నీలి శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్​గౌడ్, రాపోలు విష్ణువర్దన్, అడ్వకేట్​ కర్రె లచ్చన్న, బియ్యాల సత్తయ్య, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార ఐక్యవేదిక అధ్యక్షుడు రాజ్​కిరణ్​తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో 98 శాతం మంది బహుజనులు ఉన్నారని, వారిలో 60 శాతానికి పైగా బీసీలు ఉన్నారని తెలిపారు.

ALSO READ:అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం: దిడ్డి సుధాకర్ 

గత 70 ఏండ్లుగా అగ్రవర్ణాల వారే అధికారం అనుభవిస్తూ బీసీలను అగణదొక్కుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. ఎవరూ టికెట్​ఇవ్వకుంటే ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.