సీనియర్ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా..!

సీనియర్ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా..!

జింబాబ్వే టూర్ కోసం టీమిండియా ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ధావన్కు జట్టు పగ్గాలు అప్పగించి..ఆ తర్వాత అతన్ని తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వే టూర్కు ముందుగా ధావన్ను ఎంపిక చేసి..ఆ తర్వాత రాహుల్కు ఎలా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని బీసీసీఐని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 

మొదట కెప్టెన్గా ధావన్ ఎంపిక..
ఆగస్ట్ 18 నుంచి టీమిండియా జింబాబ్వేతో  మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జులై 31న టీమిండియాను ఎంపిక చేసింది. శిఖర్ ధావన్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాజ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ లను ఎంపిక చేసింది. 

ఫిట్నెస్ పరీక్షలో రాహుల్ పాస్..కెప్టెన్గా ఛాన్స్..
కరోనా నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ..నేషనల్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో హుటాహుటిన జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడేంచేందుకు బీసీసీఐ అతన్ని ఎంపిక చేసింది. అంతేకాకుండా కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పుతున్నట్లు ప్రకటించింది. ముందు ధావన్‌ కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ..రాహుల్ రాకతో..ధావన్కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. 

ఫ్యాన్స్ ఫైర్..
ధావన్ ఇటీవలే విండీస్ టూర్లో జట్టును విజయవంతంగా నడిపించాడు. వన్డే సిరీస్ను 3-0తో గెలిపించాడు. వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా ధావన్ అద్భుతంగా రాణించాడని చెప్పాలి. ఈ నేపథ్యంలో ధావన్ ను జింబాబ్వే టూర్ కు మరోసారి కెప్టెన్ గా ఎంపికచేయడంతో..అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కేఎల్ రాహుల్ రాకతో..హఠాత్తుగా ధావన్ను తప్పించి రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే బీసీసీఐ తీరు పట్ల అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఒకసారి కెప్టెన్ గా ధావన్ ను ప్రకటించాక..అతన్ని ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.  రాహుల్ కంటే ధావన్ సీనియర్ అని..సీనియర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా అంటు బీసీసీఐ కడిగిపారేస్తున్నారు. ఎం చేసినా ధావన్ ఏమీ అనలేడన్న ధీమా అని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.