క్రికెటర్లకు బీసీసీఐ అల్టిమేటం

క్రికెటర్లకు బీసీసీఐ అల్టిమేటం

విదేశీ లీగ్లలో ఆడేందుకు ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లను అనుమతించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఒకవేళ విదేశీ లీగ్ లలో ఆడాలనుకుంటే..భారత క్రికెట్తో తెగదెంపులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు.. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని సూచించింది. ఏవరికైనా ఇదే రూల్ వర్తింస్తుందని బీసీసీఐ పేర్కొంది. 

ధోనికైనా..ఎవరికైనా ఇదే రూల్..
సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ టీమ్ ను కొనుగోలు చేసింది. అయితే ఈ జట్టుకు ఎంఎస్ ధోనిని మెంటార్‌గా నియమించాలని సీఎస్కే యాజమాన్యం భావించింది.  బీసీసీఐ అనుమతి కోరింది. అయితే బీసీసీఐ మాత్రం చెన్నై జట్టుకు షాకిచ్చింది. అనుమతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ధోని అయినా..ఇంకెవరైనా..ఖచ్చితంగా బీసీసీఐ నిబంధన పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి  రిటైర్మెంట్ ఇచ్చినా.. ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు. అతను వచ్చే సీజన్‌లోనూ ఆడతానని ప్రకటించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే ధోని ఐపీఎల్‌కి దూరం కావాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది.

ధోనికే ఆప్షన్...
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ధోని..కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో పాల్గొనేందుకు చెన్నై జట్టు అనుమతి కోరడంతో..బీసీసీఐ ధోనికే ఆప్షన్ ను వదిలేసింది.  ఐపీఎల్ లేదా సౌతాఫ్రికా టీ20 లీగ్‌... రెండింట్లో ఒక్కదాన్ని ఎంచుకోవాలని సూచించింది. దీంతో ధోని ఆలోచనలో పడ్డాడు. బీసీసీఐ ప్రకటనతో  సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనను ధోని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడంతో ..వచ్చే ఏడాది ఐపీఎల్ అనంతరం ధోనీ సేవలను మెంటార్‌గా తమ జట్లకు వాడుకోవాలని అనుకుంటోంది