
డొమెస్టిక్ క్రికెట్ చరిత్రలో బీసీసీఐ చారిత్రక నిర్ణయం తీసుకొచ్చింది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్స్ లో ఇచ్చే ప్రైజ్ మనీని భారీగా పెంచింది. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. రంజీ ట్రోఫీ సహా మహిళల దేశవాళీ వన్డే, టీ20 టోర్నీల్లోఇచ్చే ప్రైజ్ మనీని భారీగా పెంచినట్లు తెలిపారు. ః
ప్రస్తుతం రంజీ ట్రోఫీ విజేతకు ఇస్తున్న రూ. 2 కోట్ల ప్రైజ్ మనీని రూ. 5 కోట్లకు పెంచింది. రన్నరప్ కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నారు. రంజీ సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. కోటి అందించనున్నారు. అలాగే దులీప్ ట్రోఫీ విజేతకు రూ. కోటి, రన్నరప్ కు రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ విజేతకు రూ. కోటి, రన్నరప్ కు రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దేవదర్ ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు, రన్నరప్ కు రూ. 20 లక్షలు, సయ్యద్ ముస్తాక్ అలీ విజేతకు రూ. 80 లక్షలు, రన్నరప్ కు రూ. 40 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు.
దేశవాళీ మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు. అయితే, ప్రస్తుతం రూ. 3 లక్షలే ఇస్తున్నారు. అలానే రన్నరప్ కు రూ. 25 లక్షలు అందించనున్నారు. ఇక మహిళల టీ20 ట్రోఫీ విజేతకు రూ. 40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇవ్వనున్నారు.