
న్యూఢిల్లీ: వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ప్రతీ ఏడాది వేల కోట్ల ఆదాయం వస్తోంది. దానికి తగ్గట్టుగానే బోర్డు ట్యాక్స్ కడుతోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ. 1,159 కోట్ల ఇన్కం ట్యాక్స్ కట్టింది. అంతకుముందు ఏడాది కంటే అది 37 శాతం ఎక్కువ కావడం విశేషం.
2020–21లో రూ. 844.92 కోట్ల ట్యాక్స్ కట్టింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్ల రూపాయలుగా ఉన్న బోర్డు ఇన్కం ట్యాక్స్ ఐదేళ్లలోనే రెట్టింపు కావడం విశేషం.
ఇక, 2021–22 ఆర్థిక సంవత్సరంలో బోర్డుకు రూ. 7,606 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో 3,064 కోట్లను ఖర్చు చేసింది. 2020-–21లో 4,735 కోట్ల ఆదాయం సమకూరగా 3,080 కోట్లు వివిధ పనుల కోసం ఖర్చయ్యాయి.