వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూ.. ‘ప్రజా ప్రస్థాన యాత్ర’ మొదలుపెట్టారు. ఆ యాత్ర 34వ రోజు నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో సాగుతోంది. నియోజకవర్గంలో ప్రజలను క్షేత్రస్థాయిలో కలుస్తున్నారు. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి మలివిడత పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో నేడు అపశృతి తలెత్తింది. మోటకొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దుర్గసానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో కార్యకర్తలు పరుగులు తీశారు. కానీ, షర్మిల మాత్రం అలాగే పాదయాత్ర కొనసాగించారు. ఆమె అనుచరులు తేనేటీగలను కండువాలతో ఊపుతుండగా.. ఆమె నడక సాగించారు. షర్మిల సహాయక సిబ్బంది అప్రమత్తం కావడంతో.. తేనెటీగల దాడి నుంచి వైఎస్ షర్మిల బయటపడ్డారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు చందేపల్లి గ్రామంతో 400 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ప్రజాసమస్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని షర్మిల అన్నారు.
పాదయాత్రలో షర్మిలపై తేనెటీగల దాడి
- తెలంగాణం
- March 23, 2022
లేటెస్ట్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
- ఫంక్షన్ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి
- గొడం నగేశ్ నామినేషన్పై గందరగోళం
- తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్
- మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- హరీశ్రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు