
- కలిసిరానున్న బీజేపీ విజయం
న్యూఢిల్లీ: ఈ వారం బెంచ్మార్క్ ఇండెక్స్లు ర్యాలీ చేసేటట్టు కనిపిస్తున్నాయి. బీజేపీ కీలకమైన మూడు రాష్ట్రాల్లో గెలవడంతో బుల్ రంకెలు వేయొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. మరోవైపు యూఎస్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో క్లోజయ్యాయి. ఫలితంగా ఇండియన్ మార్కెట్లు సోమవారం ఒక శాతం మేర పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.
యూఎస్ బాండ్ ఈల్డ్, డాలర్ ఇండెక్స్ తగ్గాయని, మార్కెట్కు ఇది పెద్ద పాజిటివ్ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ ఎనలిస్ట్ ప్రవేష్ గౌర్ అన్నారు. కాగా, ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే వివిధ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ నెల 8 న ఆర్బీఐ ఎంపీసీ పాలసీ నిర్ణయం వెలువడనుంది. పీఎంఐ సర్వీస్ సెక్టార్ డేటా మంగళవారం విడుదల కానుంది.
గ్లోబల్గా యూఎస్ఏ, యూకే పీఎంఐ సర్వీసెస్ డేటా, యూఎస్ జాబ్లాస్ క్లయిమ్స్ డేటా, ఎంప్లాయ్మెంట్ రేట్, నాన్ ఫార్మ్ పే రోల్ డేటా వంటివి ఈ వారమే విడుదల కానున్నాయి. కాగా, కిందటి వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,511 పాయింట్లు (2.29 శాతం) లాభపడింది. నిఫ్టీ 473 పాయింట్లు ఎగిసింది.