- హైదరాబాద్ సెకెండ్.. పుణెకు థర్డ్ ప్లేస్
ముంబై: దేశంలో ఐటీ ప్రొఫెషనల్స్కు బెస్ట్ సిటీగా బెంగళూరు నిలిచింది. ట్రాఫిక్ కష్టాలు ఎన్ని ఉన్నా సరే.. హై లివింగ్ స్టాండర్డ్స్, హైయ్యస్ట్ అప్రైజల్స్, కెరీర్ గ్రౌత్ ఆపర్చునిటీస్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే బెంగూరు బెస్ట్అని ఐటీ ప్రొఫెషనల్స్ భావిస్తున్నట్టు తాజా సర్వేలో వెల్లడించింది. 40 శాతం మందికిపైగా ఐటీ ప్రొఫెషనల్స్ పని చేయడాని బెస్ట్ సిటీ బెంగళూరు అని ఓటేసినట్టు టెక్ జిగ్ సర్వే ప్రకటించింది. ఈ లిస్ట్లో హైదరాబాద్ 13 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. 11 శాతం ఓట్లతో పుణె థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత ప్లేస్లో కోల్కతా, ఢిల్లీ ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 25–35 ఏండ్ల వయసు, కనీసరం రెండేండ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న దాదాపు 1,830 మంది ఐటీ ప్రొఫెషన్స్ అభిప్రాయాలను సేకరించారు. బెంగళూరులో హై లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయని దాదాపు 58 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్ భావిస్తున్నారు. 57 శాతం మంది తమకు తాముగా బెంగళూరు వచ్చి పనిచేస్తున్నామని చెప్పినట్టు ఈ సర్వే వెల్లడించింది. సిటీ మారండం గురించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటని ప్రశ్నించగా.. తమకు ఆ ఇంట్రెస్ట్ లేదని ఎక్కువ మంది సమాధానం ఇచ్చినట్టు పేర్కొంది. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్, ఫ్రెషర్లకు బెస్ట్ ఆపర్చునిటీస్ అందించడంలో బెంగళూరు టాప్ లో ఉందని 61 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఐటీ సెక్టార్లో కెరీర్ను సరిగ్గా మొదలుపెట్టడానికి బెంగళూరు కరెక్ట్ సిటీ అని వీరంతా చెప్పారు.