
మెదక్ టౌన్, వెలుగు: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం గిరిజన విద్యార్థులకు ఒక వరంలాంటిదని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. శుక్రవారం మెదక్కలెక్టర్ఆఫీసులో లక్కీ డ్రా ద్వారా 49 మంది స్టూడెంట్స్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. 3వ తరగతిలో 27 మంది దరఖాస్తు చేసుకోగా 25 మంది, 5వ తరగతిలో 38 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది, 8వ తరగతికి 13 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ స్కీంకు ఎంపిక కాని స్టూడెంట్స్నిరాశ చెందకుండా ప్రభుత్వ స్కూళ్లలో చేరాలని సూచించారు. అనంతరం రైతు భరోసా కింద జిల్లా వ్యాప్తంగా 2,48,890 మంది రైతుల ఖాతాల్లో రూ.187.14 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
కొత్తగా భూమి హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనన్నారు. వారు సరైన పత్రాలతో ఏఈవోను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు స్టేడియాన్ని క్రీడల నిర్వహణ అధికారితో కలిసి పరిశీలించారు. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, గ్రామపంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, కాలేజీలలో యోగా దినోత్సవాన్ని జరపాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ నగేశ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, స్టూడెంట్స్తల్లిదండ్రులు పాల్గొన్నారు.