
రణబీర్ కపూర్ , అలియా భట్ జంట .. బాలీవుడ్ జంటలలోఫేమస్. వారు జంటగా బయటకొచ్చిన ప్రతి సారి ఏదో వార్త వైరల్ అవ్వాల్సిందే.. వారు శుభ కార్యక్రమానికి వెళ్లినా.. అశుభ కార్యక్రమానికి వెళ్లినా సరే వైరల్ మాత్రం కామన్. తాజాగా ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా ఏప్రిల్ 21( శుక్రవారం)న కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు. రణబీర్ కపూర్, అలియాభట్ ఆ రోజు సాయంత్రం ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి చేరుకున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ ఆదిత్య చోప్రా ఇంటికి వెళుతున్నప్పుడు వీడియోను రికార్డ్ చేశారు.
రణబీర్, అలియా క్యాజువల్ లుక్లో ఉన్నారు. అలియా లుక్ కూడా చాలా సింపుల్గా కనిపించింది. రణబీర్-అలియా ఒకరి వెనుక ఒకరు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సమయంలోనే రణబీర్ ఆలియా చెప్పులను ఎత్తుకుని వెళ్లడం రికార్డయింది. దీనిపై రణబీర్ ట్రోల్స్ కు గురవుతున్నారు. వీడియోలో.. అలియా రణబీర్ ముందు నడుస్తూ కనిపించింది. ఆమె మొదట ఇంట్లోకి ప్రవేశించే ముందు బయట మెట్ల దగ్గర తన చెప్పులు వదిలేస్తుంది. వెనకే వచ్చిన రణబీర్ ఆమె చెప్పులు తీసి లోపల పెడతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రణబీర్ కపూర్పై కొంతమంది మండిపడగా ..కొంతమంది బెస్ట్ భర్త అని పొగుడుతున్నారు.
రణబీర్ కపూర్,అలియా భట్ గత ఏడాది ఏప్రిల్ 14 న వివాహం చేసుకున్నారు. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది, ఇది ఒక ప్రైవేట్ వేడుక కావడంతో దీనికి సన్నిహితులు , కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగా యానిమల్ కోసం లండన్లో షూటింగ్ సమయంలో రణబీర్ తన మొదటి వార్షికోత్సవాన్ని తన భార్య అలియాతో గడపడానికి ముంబైకి వెళ్లాడు. అప్పుడు ఈ జంట అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివలో మొదటిసారిగా స్క్రీన్ను పంచుకున్నారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.