భద్రాచలం ఐటీడీఏకు రాష్ట్రపతి నుంచి బెస్ట్ అవార్డు

భద్రాచలం ఐటీడీఏకు రాష్ట్రపతి నుంచి బెస్ట్ అవార్డు

భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు, భద్రాచలం ఐటీడీఏకు న్యూఢిల్లీ విజ్ఞాన్​భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెస్ట్ అవార్డును శుక్రవారం రాత్రి అందజేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్​ శనివారం వెల్లడించారు. ధర్తీ అభాజాన్​ జాతీయ గౌరవ అభియాన్​, ఆదికర్మయోగి అభియాన్​ పథకాల ద్వారా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా ఈ అవార్డును అందజేసినట్లు ఆయన వివరించారు.

 2030 నాటికి 130 గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఈ స్కీం లక్ష్యమని పేర్కొన్నారు. మౌళిక వసతుల కల్పనకు 65 అంశాలలో రూ.1341 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పోర్టల్​లో అప్​లోడ్​ చేసినట్లుగా తెలిపారు. ఆఫీసర్ల​ అంకితభావం,నిబద్ధత ప్రశంసనీయం అని వారి సహకారంతోనే ఈ అవార్డును సాధించినట్లుగా చెప్పారు.