
భద్రాచలం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు, భద్రాచలం ఐటీడీఏకు న్యూఢిల్లీ విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెస్ట్ అవార్డును శుక్రవారం రాత్రి అందజేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ శనివారం వెల్లడించారు. ధర్తీ అభాజాన్ జాతీయ గౌరవ అభియాన్, ఆదికర్మయోగి అభియాన్ పథకాల ద్వారా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమంలో ప్రతిభ ఆధారంగా ఈ అవార్డును అందజేసినట్లు ఆయన వివరించారు.
2030 నాటికి 130 గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఈ స్కీం లక్ష్యమని పేర్కొన్నారు. మౌళిక వసతుల కల్పనకు 65 అంశాలలో రూ.1341 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు. ఆఫీసర్ల అంకితభావం,నిబద్ధత ప్రశంసనీయం అని వారి సహకారంతోనే ఈ అవార్డును సాధించినట్లుగా చెప్పారు.