స్కూళ్ల రీ ఓపెన్​ నాటికి బుక్స్​ అందిస్తాం : కలెక్టర్ జితేశ్​వి పాటిల్

స్కూళ్ల రీ ఓపెన్​ నాటికి బుక్స్​ అందిస్తాం : కలెక్టర్ జితేశ్​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్కూళ్ల రీ ఓపెన్​ నాటికి బుక్స్​ అందిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ తెలిపారు. కొత్తగూడెంలోని పాఠ్యపుస్తకాల గోడౌన్​ను బుధవారం ఆయన సందర్శించారు. జిల్లాకు అవసరమైన బుక్స్​లో ఇప్పటికే 70శాత బుక్స్​ వచ్చాయన్నారు. మిగిలిన బుక్స్​ఈ నెల 25లోపు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయని చెప్పారు. మండలాలకు బుక్స్​ పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టాలన్నారు. 

పాఠ్యపుస్తకాలతో పాటు నోట్​ బుక్స్​ను స్టూడెంట్స్​కు ఇవ్వనున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో నాణ్యమైన సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్​ స్కూల్​లో చేరేలా టీచర్స్​ ప్లాన్​ చేయాలని సూచించారు. కలెక్టర్​ వెంట డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా అకాడమిక్​ మానిటరింగ్​ అధికారి నాగరాజశేఖర్, జిల్లా ప్లానింగ్​కో ఆర్డినేటర్​సతీశ్​కుమార్, గోడౌన్​ ఇన్​చార్జి రవి ప్రతాప్​ఉన్నారు.