
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో బాలికల కంటే బాలురు ఎందుకు వెనుకబడి ఉన్నారని, వారి ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్లోనూ డిజిటల్ ఎడ్యుకేషన్, ఫేషియల్అటెండెన్స్ ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు అటెండ్ అవుతున్న సంఖ్యకు యూ డైస్ ప్లస్లో నమోదవుతున్న సంఖ్యలో చాలా తేడాలున్నాయన్నారు.
తేడాలున్న కాలేజీల ప్రిన్సిపాల్స్ను పిలిపించి జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ యూడైస్ ప్లస్ పోర్టల్లో నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు. జూనియర్ కాలేజీల్లో పెద్ద మైదానాలున్నప్పటికీ ఇంకుడు గుంతల నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, డీఈఓ వెంకటేశ్వాచారి, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.