
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న 150 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ ఆఫీస్లో బుధవారం జరిగిన ప్రోగ్రాంలో బాధితులకు ఎస్పీ రోహిత్ రాజు ఫోన్లను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశామన్నారు. గత ఐదు నెలల్లో పోగొట్టుకున్న 743 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలని సూచించారు. రికవరీ చేయడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ ప్రోగ్రాంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్చార్జి రాము, ఎస్సై సురేశ్, ఐటీ సెల్ సిబ్బంది మహేశ్, నరేన్, నవీన్, నరేశ్ పాల్గొన్నారు.