భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో YSRTP చీఫ్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. సుజాత నగర్ మండలం..పాత అంజనాపురం క్యాంపు నుంచి ఇవాళ్టి యాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. సుజాత నగర్ గ్రామంలో రైతు గోస మహా ధర్నాలో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి పల్లి గ్రామస్తులతో మాట ముచ్చట నిర్వహించనున్నారు. సింగభూపాలెం, సుజాత నగర్, సీతంపేట బంజారా, కోమటి పల్లి, చింతల తండా, నిమ్మల గూడెం మీదుగా షర్మిల యాత్ర కొనసాగనుంది.
మరిన్ని వార్తల కోసం
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు