కామేపల్లి, వెలుగు: అమరవీరుల వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేశ్ పిలుపునిచ్చారు.గురువారం కామేపల్లి మండల కేంద్రంలో విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 95వ వర్ధంతి సభలు,అమరవీరుల వర్ధంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
మార్చి 23 నుంచి 30 వరకు పీవైఎల్, పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాలను గెలిపించడమే నేటి యువత ముందున్న ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
వారం రోజుల పాటు జరిగే ఈ పోరాట సభల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేష్, మురళి, గోవర్ధన్, భూపతి, కళ్యాణ్ పాల్గొన్నారు.
