రవితేజ, డింపుల్ హయతి జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ సాంగ్కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘అద్దం ముందు’ అంటూ సాగే పాటను డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
సోమవారం ఈ పాటకు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ‘అద్దం ముందు నిలబడి.. అబద్దం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి.. ఈ నిజం దాచలేనే..’ అంటూ సాగిన ప్రోమో ఆకట్టుకుంది. రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్ ప్లెజెంట్గా ఉన్నాయి. వీరిమధ్య కెమిస్ట్రీ ఇంప్రెస్ చేయగా, ఫుల్ సాంగ్పై ఆసక్తిని పెంచింది.
ఈ మెలోడీ డ్యూయెట్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి పాడారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు.
