
సీఎం రేవంత్కు చెక్కు అందజేత
హైదరాబాద్: వరద బాధితుల సహాయం కోసం భాష్యం విద్యాసంస్థలు భారీ విరాళాన్ని ప్రకటించాయి. సీఎంఆర్ఎఫ్కు రూ.1.25 కోట్ల విరాళాన్ని అందించాయి. అందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డిని కలిసి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చైర్మన్ రామకృష్ణను అభినందించారు.