గద్దర్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించాలి: భట్టి విక్రమార్క

గద్దర్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్ లోని హైటెక్స్ లో జూన్ 14న  జరగనున్న  గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకను   ఘనంగా  నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖుల అందరిని ఆహ్వానించాలని, తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. 

జూన్ 10న సబ్ కమిటీ సభ్యులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ స్పెషల్ సిఎస్ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీష్, ఎఫ్డిసి డైరెక్టర్ కిషోర్ బాబులతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి.  ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. హైదరాబాద్ ను  సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.  ఫిల్మ్ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ  10 ఏండ్ల తర్వాత  ఇప్పుడు గద్దర్  అవార్డ్స్  పేరుతో కాంగ్రెస్  ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించనుంది. ఇప్పటికే పదేళ్ల సినిమాలకు అవార్డులను ప్రకటించింది.