
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ విషయం కచ్చితంగా జోష్ నింపుతుంది. ఆయన హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య నడిచే పోరుగా తెరకెక్కింది. ఈ మూవీ గత నెల ఫిబ్రవరి 25న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలచేయబోతున్నారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ను హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్ను శుక్రవారం మార్చి 25న విడుదలచేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. గతేడాది వచ్చిన వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ బాట పట్టిస్తున్నారు.
Next friday ee time ki, power storm mee intiki vachesthundhi.
— ahavideoIN (@ahavideoIN) March 17, 2022
dates mark cheskondi, calendar kaaliga unchukondi. #ahaLaBheemla from March25 nundi ??#ahaLaBheemlaFromMarch25@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @SitharaEnts @MenenNithya @MusicThaman pic.twitter.com/eO0lEuKnZm
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించారు.
For More News..