భోళా శంకర్ విడుదలపై వీడని సస్పెన్స్.. సాయంత్రమే తుది తీర్పు?

భోళా శంకర్ విడుదలపై వీడని సస్పెన్స్.. సాయంత్రమే తుది తీర్పు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలను ఆపాలని ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. 

నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమా విషయంలో తమకు రావాల్సిన రూ.30 కోట్ల రూపాయలను ఇంకా ఇవ్వలేదని, అవి ఇచ్చేవరకు భోళా శంకర్ సినిమా విడుదలను ఆపేయాలని కోరారు వైజాగ్ సతీష్. దీనిపై గురువారం ఇరుతరుపున వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సాయంత్రం వెల్లడించనుందని తెలుస్తోంది.

ఇక భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాను దర్శకుడు మెహెర్ రమేష్ తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కోర్టు ఏం తీర్పును ఇవ్వనుందో అనే ఉత్కంఠ నెలకొంది.