కూష్మాండ దుర్గ అలంకరణలో  భ్రమరాంబిక అమ్మవారు

కూష్మాండ దుర్గ అలంకరణలో  భ్రమరాంబిక అమ్మవారు

శ్రీశైలం, వెలుగు : అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబికాదేవి అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక వేదికలో అర్చకులు, వేద పండితులు అలంకరించిన  అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు చేశారు. 

దసరా ఉత్సవాల సందర్భంగా రాత్రి ఆది దంపతులకు కైలాస వాహన సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కైలాస వాహనంపై ఉంచి అర్చకులు, వేదపండితులు పూజలు చేశారు. అనంతరం కూష్మాండ దుర్గ, స్వామి అమ్మవార్లను  గ్రామోత్సవానికి తరలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.