
చెన్నై: దేవధర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ టీమ్లో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, హైదరాబాద్ క్రికెటర్ రోహిత్ రాయుడుకు చోటు దక్కింది. ఈ నెల 24 నుంచి పుదుచ్చేరిలో ఈ టోర్నీ జరగనుంది. సౌత్ టీమ్ను మయాంక్ అగర్వాల్ నడిపించనున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో బాగా రాణించిన ప్లేయర్లను ఈ టీమ్కు ఎంపిక చేశారు. గోవాకు ప్రాతినిధ్యం వహించిన అర్జున్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి సంయుక్తంగా రెండో ప్లేస్లో నిలిచాడు. ఇక ఎమర్జింగ్ ఆసియా కప్లో ఆడనున్న బి. సాయి సుదర్శన్ను స్టాండ్ బై ప్లేయర్గా తీసుకున్నారు.
జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కేబీ అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కావేరప్ప, వైశాక్, కౌశిక్, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్.