కుక్కలా తిరిగి ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్.. పల్లవి ప్రశాంత్పై రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

కుక్కలా తిరిగి ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్.. పల్లవి ప్రశాంత్పై రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) అప్పుడే సెకండ్ వీక్ కు చేరుకుంది. ఫస్ట్ వీక్ లో కిరణ్ రాథోడ్(Kiran Rathod) ఇంటి నుండి ఎలిమినేట్ అయినా విషయం తెల్సిందే. తాజాగా సెకండ్ వీక్ కు సంబంధించిన రెండో ప్రోమో రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం నామినేషన్స్ చాలా హీటెక్కిస్తున్నాయి. 

తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ అండ్ అతని బిహేవియర్ పై రెచ్చిపోయారు. సింపతీ కోసం ట్రై చేస్తున్నావ్ అంటూ ఒకరి తరువాత ఒకరి మండిపడ్డారు. ప్రోమోలో ముందు పల్లవి ప్రశాంత్ పిట్ మీదికి రాగానే.. అతన్ని ఎవరెవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో ముందుకు రండి అని చెప్పారు బిగ్ బాస్. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, దామిని, ప్రియాంక, షకీలా ముందుకు వచ్చారు.

ఈ నలుగురిలో అమర్ దీప్ అండ్ ప్రియాంక పల్లవి ప్రశాంత్ పై రెచ్చిపోయారు. ప్రతీదానికి రైతు బిడ్డ అని చెప్పుకుంటావ్ అని, చెప్పేసి కూడా పూర్తిగా వినకుండా నువ్వే మాట్లాడేసుకుంటావ్ అంటూ చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా ప్రశాంత్ నీ సీరియల్ యాక్టింగ్ నా దగ్గర చేయకంటూ కామెంట్ చేశారు. దానికి నేను పుట్టినప్పుడే నటించడం నేర్చుకున్నాను, నీలా మధ్యలో కావాలని నటించడలేదు. అలా నటిస్తూ సింపతీ కోసం ట్రై చేస్తున్నావ్ అని అరిచాడు. దానికి ప్రశాంత్.. బిగ్ బాస్ కు రావడం నా కల. దాని కోసం అన్నపూర్ణ గేట్ దగ్గర కుక్కలా తిరిగాను అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలకు స్పందించిన రతిక.. కుక్కలా తిరిగి ఇక్కడికొచ్చు ఏం చేస్తున్నావ్ అంది. ఈ మొత్తం ప్రోమో చాలా ఇంట్రెస్టింగా సాగింది. ఆడియన్స్ కు కూడా ఇవాళ్టి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది.