- ఏప్రిల్ 4 వరకు అప్లికేషన్కు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించనున్న టీజీ ఈఏపీసెట్–2026కు భారీ స్పందన లభిస్తోంది. సోమవారం సాయంత్రం వరకు మొత్తం 2,20,879 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,55,804 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు 64,866 మంది అప్లై చేశారు. రెండు విభాగాలకు కలిపి 209 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గత నెల 19న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు జరిమానా లేకుండా కొనసాగనుంది. దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షా కేంద్రాలు వేగంగా నిండుతున్నాయి. రాష్ట్రంలోని 16 టెస్ట్ జోన్లలో 10 జోన్ల సెంటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్(జోన్ 1, 2, 3), ఖమ్మం, సత్తుపల్లి, వరంగల్ కేంద్రాల్లోనే స్లాట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ తెలిపారు.
