ఆహార ధాన్యాలతో మోడీకి బర్త్ డే గ్రీటింగ్స్

ఆహార ధాన్యాలతో  మోడీకి బర్త్ డే గ్రీటింగ్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే సందర్భంగా ఒడిశాకు చెందిన ఆర్టిస్ట్ ప్రియాంక సహానీ మోడీ చిత్తరువును రూపొందించారు. బియ్యం, అటుకులు, పప్పులు లాంటి ఆహార ధాన్యాలతో మోడీ పోర్ట్రెయిట్ తయారు చేయడం విశేషం. ఒడిశా సంప్రదాయ పటుచిత్ర డిజైన్ లో మోడీ చిత్తరువు తయారు చేసినట్టు ప్రియాంక సహానీ చెప్పారు. ఒడిశా ప్రజల తరపున ఈ విధంగా ప్రధాని మోడీకి బర్త్ డే గ్రీటింగ్స్ తెలుపుతున్నట్టు ఆమె చెప్పారు.