బిట్​ బ్యాంక్​ : సాహిత్యోద్యమాలు

బిట్​ బ్యాంక్​ : సాహిత్యోద్యమాలు

సాహిత్యోద్యమాలు

  •     1911లో కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశదాసు పునాది వేశారు. 
  •     1913 డిసెంబర్​ హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోనూ కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని రత్నమాంబదేశాయి అద్భుతమైన పద్యాలు రాశారు. 
  •     జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, స్టేట్​ కాంగ్రెస్​ ఉద్యమం, 
  • భూదానోద్యమం, సహకారోద్యమంలో కోదాటి నారాయణరావు ప్రధాన పాత్ర వహించింది. 
  •     కోదాటి నారాయణరావు ప్రగతి, బాలసరస్వతి అనే పత్రికలు నిర్వహించారు. 
  •     ఆంధ్రసారస్వత పరిషత్తును కోదాటి నారాయణరావు స్థాపించారు. 
  •     పాశం నారాయణ రెడ్డి రచనలు దయానంద సరస్వతి జీవిత చరిత్ర (బుర్ర కథ), 
  •     త్యాగమూర్తులు, సదాశివరెడ్డి పద్య కావ్యం.
  •     మిత్ర ధర్మం కోసం నిజాంను ఎదురించిన 
  •     పాపన్నపేట సంస్థానాధీశుడు సదాశివరెడ్డి.
  •     తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా స్థాపించబడ్డ మొదటి సాహిత్య సంస్థ సాహితి మేఖల.
  •     సాహితి మేఖల సంస్థను 1936లో నల్లగొండలో అంబటిపూడి వెంకటరత్నశాస్త్రి 
  •     ప్రారంభించారు. 
  •     సాహితి మేఖల సంస్థ దాశరథి రంగాచార్య రచించిన అగ్నిధార, అంబడిపూడి వెంకటరత్నం రచించిన తుర్క భాష, పున్నం అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక, పులిజాల 
  •     గోపాలరావు రచించిన ఖడ్గతిక్కన గ్రంథాలను ప్రచురించారు. 
  •     1939లో సాధన సమితి అనే సంస్థను బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెలుదుర్తి మాణిక్యాలరావు స్థాపించారు. 
  •     1941, నవంబర్​ 20న సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహిత్య సంస్థ విజ్ఞాన వర్ధిని పరిషత్తు. 
  •     విజ్ఞానవర్ధిని పరిషత్తు ద్వారా ప్రచురితమైన ప్రతాపరెడ్డి రచనలు రామాయణ విశేషాలు, మృత్యు సిద్ధాంతం, ఆంధ్రప్రతాపరుద్ర 
  •     యశోభూషణం.
  •     1943 మే 26న తెలుగు భాషా వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్​లో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్​  అనే సంస్థ ఆవిర్భవించింది.
  •     నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్​ 1949 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్​ పేరుతో వ్యవహరించబడుతోంది. 
  •     నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్​ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రంగనాథరావు. 
  •     నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్​కు అధ్యక్ష కార్యదర్శులుగా లోక్​నంది శంకరనారాయణరావు, బిరుదు వెంకటరెడ్డి పనిచేశారు. 
  •     కావ్యాలంకార సంగ్రహాన్ని సూర్యనారాయణ శాస్త్రి రచించారు. 
  •     సారస్వత వ్యాసముక్తావళిని బూర్గుల రామకృష్ణారావు రచించారు. 
  •     శాలివాహన గాథాసప్తశతి సారాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణశాస్త్రి రచించారు. 
  •     సాహిత్య సోపానాలు అనే గ్రంథాన్ని దివాకర్ల వెంకటావధాని రచించారు. 
  •     ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రచించారు. 
  •     కృష్ణశాస్త్రి రచనలు పల్లె పదాలు, స్త్రీల పౌరాణిక పాటలు.
  •     మనదేశం అనే పుస్తకాన్ని దేవులపల్లి రామానుజరావు రచించారు. 
  •     వీరగాథలు రచించింది రామకృష్ణశర్మ.
  •     మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు. 
  •     ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్​ ఆంధ్రప్రదేశ్​ సాహిత్య అకాడమీగా మారింది. 
  •     రావి నారాయణరెడ్డి స్థాపించిన సాహితీ సంస్థ వైతాళిక సమితి.
  •     రైతులపై బోయినపల్లి విశ్వనాథరావు పద్యాలు రాశారు. 
  •     గాంధీజీ హరిజనోద్ధరణ, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమాల ప్రభావంతో దళితుల మీద జొన్నలగడ్డ హన్మంతరెడ్డి పద్యాలు రచించారు. 
  •     దళితులపై కవిత్వం రాయడమే కాకుండా వారి కోసం పాఠశాల నడిపిన కవి శాయిరెడ్డి. 
  •     తెలంగాణ సాయుధ  పోరాట కాలంలో ఆంధ్రకు వెళ్లిన తెలంగాణ వాళ్లను ఛీత్కరిస్తూ ఆదరాభిమానములు అనే కవితను ధవళా శ్రీనివాసరావు రచించింది.
  •     బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావ్​ కొడుకో నైజాం సర్కరోడా అనే పాటను రాసి సాయుధ పోరాటాన్ని ఉర్రూతలూగించింది బండి యాదగిరి. 
  •     తెలంగాణ అంతటా మారుమ్రోగిన పసులగాసే పోరగాడా పాలుమరసి ఎన్నాల్లయ్యిందో అనే పాటను సుద్దాల హన్మంతు రచించారు. 
  •     సైసై గోపాలరెడ్డి! నీవు నిలిచావు ప్రాణాలొడ్డి అంటూ తిరునగరి రామాంజనేయులు స్మృతి గీతాలు రచించారు. 
  •     మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లల చంపి మనల బంధించిన అంటూ ఉద్యమ సందేశాన్ని కాళోజీ నారాయణరావు అందించారు.