బిట్​ బ్యాంక్​..సామాజిక సాంస్కృతిక చరిత్ర

బిట్​ బ్యాంక్​..సామాజిక సాంస్కృతిక చరిత్ర

బిట్​ బ్యాంక్​..సామాజిక సాంస్కృతిక చరిత్ర

  •     జ్యోతి బాపూలే జీవితం నుంచి స్ఫూర్తి పొందిన అమెరికా అధ్యక్షుడు జార్జ్​ వాషింగ్టన్​.
  •     బరోడా రాజు షియాజీరావ్​ షిండే జ్యోతిబాపులేకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేశాడు.
  •     సమాజ్ సమతా సంఘాన్ని బి.ఆర్​.అంబేద్కర్​  స్థాపించారు. 
  •     వెనుకబడ్డ బిడ్డల కోసం మొదటిసారిగా హరిజన్ అనే పదాన్ని మహాత్మా గాంధీ వాడారు. 
  •     పాకిస్తాన్ అండ్​ పార్టిషియన్​ ఆఫ్​ ఇండియా గ్రంథాన్ని బి.ఆర్​.అంబేద్కర్ రచించారు. 
  •     కోయంబత్తూర్​లో స్టాలిన్​ హాల్​ను ఇ.వి.రామస్వా నాయర్​ నిర్మించారు.
  •     1917లో జస్టిస్​ పత్రికను ప్రచురించిన సంస్థ దక్షిణ భారత ప్రజల సంఘం.
  •     కేరళలో నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి నారాయణ గురు.
  •     దయానందుని మరణానంతరం ఆర్య సమాజం రెండు వర్గాలు చీలింది.
  •     రాజా రామ్​మోహన్​ రాయ్​ విదేశీ స్నేహితులు అలెగ్జాండర్​ డఫ్​, డేవిడ్​ హేర్​.
  •     రాజా రామ్​మోహన్ రాయ్​ వ్యతిరేకంగా పోరాడిన సమస్యలు బాల్య వివాహాలు, సతీ సహగమనం, బాహు భార్యత్వం, విగ్రహారాధన.
  •     కేశ చంద్రసేన్ భావాలను ప్రచారం చేసిన పత్రికలు సులభ్​ సమాచార్​, ఇండియన్​ మిర్రర్​, ధర్మతత్వ, బ్రహ్మబోధిని. 
  •     ఏషియాటిక్​ సొసైటీకి సెక్రటరీగా పనిచేసిన బ్రహ్మ సమాజ నేత కేశవ చంద్రసేన్​. 
  •     వితంతు పునర్వివాహ చట్టం చేయడానికి ముఖ్య కారణం ఈశ్వర్​ చంద్ర.
  •     విద్యాసాగరుడు అనే బిరుదును ప్రదానం చేసింది కలకత్తా సంస్కృతి కళాశాల.
  •     అనీబిసెంట్​ భారత జాతీయ కాంగ్రెస్​లో 1914లో చేరారు.
  •     చిత్తూరు జిల్లా మదనపల్లి జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపల్​ హెచ్​.డి.కజిన్స్​.
  •     బాంబే వితంతు వివాహ చట్టాన్ని విష్ణుశాస్త్రి పండిత్​ 1866లో స్థాపించారు. 
  •     హిందూ సమాజంలో కులతత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ హై క్యాస్ట్​ హిందూ ఉమెన్​ అనే గ్రంథాన్ని పండిత రమాబాయి రచించారు. 
  •     1906లో బొంబాయిలో ఇండియా బడుగుజాతుల సమితి అనే సంస్థను నెలకొల్పిన ప్రముఖప్రార్థనా సమాజ సభ్యుడు విఠల్​రాంజీ షిండే.
  •     కేశవ్​చంద్రసేన్​ 1857లో బ్రహ్మ సమాజంలో చేరాడు.
  •     హిందూ దేశ దర్పణం అనే పక్ష పత్రికను 1861లో కేశవ చంద్రసేన్​ ప్రచురించారు.
  •     వితంతు వివాహాలు శాస్త్రసమ్మతమేనని తెలుపుతూ 1856లో ఒక సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించి సనాతన హిందువుల్లో తీవ్ర సంచలనాన్ని కలిగించిన సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్​.
  •     సాధారణ బ్రహ్మ సమాజం 1878లో ఏర్పడింది.
  •     తత్వకౌముది, ఇండియన్​ మిర్రర్​ పత్రిక సాధారణ బ్రహ్మ సమాజ్​కు చెందినవి.
  •     జ్యోతిరావ్​ పూలే నెలకొల్పిన ప్రసిద్ధి సంస్థ సత్య శోధక్​ సమాజ్​.
  •     సత్యశోధక్​ సమాజ్​ను 1873లో నెలకొల్పారు.
  •     నారాయణగురు నిర్వహించిన సంఘ సంస్కర్త సత్యశోధక్​ సమాజ్​ ప్రారంభించిన ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించాడు.
  •     పరమహంస మండలి స్థాపకుడు ధరోజీ.
  •     సిక్కుల్లో నిరంకారి ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడు బాబా దయాల్​ దాస్​.
  •     పంజాబ్​లోని సిక్కుల్లో నామధారి ఉద్యమాన్ని నిర్వహించిన వారు బాయిరాంసింగ్​.
  •     భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని 1916లో నెలకొల్పిన మహనీయుడు డి.కె.కార్వే.
  •     పండిత రమాబాయి ఆర్య మహిళా సమాజం స్థాపించింది.
  •     1910లో సరళాదేవి చౌద్రాణి భారత స్త్రీ మండలిని అలహాబాద్​ నగరంలో నెలకొల్పారు.
  •     ది ఉమెన్స్​ ఇండియన్​ అసోసియేషన్ స్థాపకురాలు దోరోతి జినరాజదాస్​.
  •     1927లో అఖిల భారత మహిళా సమావేశం పూణె నగరంలో జరిగింది.
  •     1866లో లాహోర్​లో సర్​ సయ్యద్​ అహ్మద్​ఖాన్​ అనుచరుల్లో ఒకడైన మహ్మద్​ షఫీ స్థాపించిన ఇస్లాం సంస్కరణ సంస్థ అంజుమన్​ ఇ హిమాయిత్​ ఇ ఇస్లాం.
  •     వహాబీ ఉద్యమాన్ని సయ్యద్​ అహ్మద్​ రాయ్​ బరేల్వి ఆచరించారు. 
  •     దియోబంద్​ ఉద్యమ కర్తలో ప్రముఖుడు మహ్మద్​ ఖాసీం ననౌతవీ.
  •     1924లో ప్రారంభించిన వైకోం సత్యాగ్రహం నిమ్న కులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించే ఉద్దేశంతో ప్రారంభించారు. 
  •     భారతదేశ మార్టిన్​ లూథర్​ కింగ్​ అని రాజా రామ్​మోహన్​ రాయ్​ను పిలుస్తారు.
  •     బి.ఆర్​.అంబేద్కర్​ స్థాపించిన సంస్థలు సమాజ సమతా సంఘం, ప్రజా విద్యా సంస్థ, అణగారిన వర్గాల వ్యవస్థ.
  •     ఈస్టిండియా, హెస్పరస్​ వార్తా పత్రికలు హెన్రి వివియన్​ డిరాజియోకు సంబంధించినవి.
  •     బంకించంద్ర ఛటోపాధ్యాయ కలకత్తా విశ్వవిద్యాలయంలో మొదటి పట్టభద్రుడు.
  •     డేవిడ్​ హారే, అలెగ్జాండర్​ డఫ్​లతో కలిసి కలకత్తాలో హిందూ కాలేజిని రాజ్​ రామ్​మోహన్​ రాయ్​ స్థాపించాడు.