ఇందూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా : ధన్​పాల్​ సూర్యనారాయణ

ఇందూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా : ధన్​పాల్​ సూర్యనారాయణ

నిజామాబాద్​అర్బన్, వెలుగు :  తనకు అవకాశమిస్తే ​ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇందూరు నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి ధన్​పాల్​ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 41వ డివిజన్​లోని వివిధ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదేండ్లలో అధికారంలో ఉన్న సిట్టింగ్​ఎమ్మెల్యే బిగాల గణేశ్ ​గుప్తా నగరాభివృద్ధిని గాలికొదిలేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు.  

ప్రజాల కనీస అవసరాలను సైతం తీర్చడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.