4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ అధిష్టానం

4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ అధిష్టానం

4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ అధిష్టానం

తెలంగాణకు బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా ప్రకాశ్ జవదేకర్ 

సహా ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్

బీజేపీ అధిష్టానం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ లో ఎలక్షన్స్ జరగనున్న  ఐదు రాష్ట్రాలపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో ఈ ఐదు రాష్ర్టాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని వ్యూహా రచన చేస్తోంది. ఇందులో భాగంగానే నాలుగు రాష్ర్టాలకు సీనియర్ నాయకులను ఎన్నికల ఇన్ చార్జులుగా నియమించింది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ చార్జ్ గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను నియమించారు. ఎన్నికల సహా ఇన్ చార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించారు. 

ALSO READ :ఫ్రీ అంటే ఇలాగే ఉంటది : మందు ధరలు భయంకరంగా పెంచిన కర్ణాటక

*  తెలంగాణకు బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా ప్రకాశ్ జవదేకర్

* రాజస్థాన్ కు బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా ప్రహ్లాద్ జోషి

* ఛత్తీస్ గఢ్ కు బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా ఓం ప్రకాశ్ మాథూర్

* మధ్యప్రదేశ్ కు బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ గా భూపేంద్ర యాదవ్