బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు : ఎంపీ డీకే.అరుణ

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు  : ఎంపీ డీకే.అరుణ

నల్గొండ అర్బన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్​కు చిత్తశుద్ధి లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే.అరుణ ఆరోపించారు. బుధవారం నల్గొండ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

  దేశ చరిత్రలో జూన్ 25ను చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధాని మోదీని విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.  ఫోన్​ట్యాపింగ్, కాళేశ్వరం విషయాల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. అంతకముందు చర్లపల్లిలో  మొక్కలు నాటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.