
మంచిర్యాల, వెలుగు: రానున్న లోకల్ బాడీస్ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ స్టేట్జనరల్ సెక్రటరీ దుగ్యాల ప్రదీప్ రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం పార్టీ మంచిర్యాల జిల్లా ఆఫీస్లో వర్క్షాప్ నిర్వహించారు. పాల్గొన్న ప్రదీప్మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
జిల్లాలో 9 జడ్పీటీసీలు, మెజారిటీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో పాటు జిల్లా పరిషత్ను కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నా. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్ రావు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సంసిద్ధం కావాలని ఆదిలాబాద్ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం భోరజ్లో నిర్వహించిన పార్టీ మండల వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మెజార్టీ స్థానాలు గెలిచేలా కృషి చేయాలన్నారు. పెండల్ వాడకు చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.