- బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి
- ప్రమాణం చేసిన 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు
బెల్లంపల్లి, వెలుగు: రాజకీయాలకు అతీతంగా బెల్లంపల్లి పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి అన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, సుందరంగా తీర్చిదిద్దడానికి అందరు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు.
రాగద్వేశాలకు పోకుండా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లను మున్సిపల్ చైర్ పర్సన్ పలకరించి అభినందనలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సంపత్రెడ్డి, వైస్ చైర్పర్సన్ రాగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
