రేపు జగిత్యాలకు కేసీఆర్.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

 రేపు జగిత్యాలకు కేసీఆర్.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

జగిత్యాల : రేపు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా వెల్గటూర్,ధర్మపురి,బుగ్గారం,గొల్లపల్లి,కొడిమ్యాల,పెగడపల్లి బీజేపీ నాయకులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగిత్యాలకు చేరుకోనున్న కేసీఆర్...  ముందుగా  కొత్తగా నిర్మించిన  జిల్లా పార్టీ కార్యలయాన్ని సీఎం  ప్రారంభించనున్నారు.  అనంతరం 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. 

అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.  అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన  మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు సీఎం కేసీఆర్‌ పయనంకానున్నారు. ఇప్పటికే సీఎం టూర్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.