ప్రజలను పట్టించుకోని మంత్రి జగదీశ్ రెడ్డిని ఓడించాలి : సంకినేని వెంకటేశ్వర్ రావు

ప్రజలను పట్టించుకోని  మంత్రి జగదీశ్ రెడ్డిని ఓడించాలి : సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు: పేద ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకోని మంత్రి జగదీశ్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం బీజేపీలో చేరగా.. వారికి వెంకటేశ్వర్​ బీజేపీలోకి ఆహ్వానించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ని కలువడానికి ఆయన క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన సామాన్య ప్రజలను ఏనాడు కలవలేదన్నారు.

అభివృద్ధి పనుల ముసుగులో కాంట్రాక్టర్ల దగ్గర మంత్రి జగదీశ్​రెడ్డి కోట్ల రూపాయాల్లో కమీషన్ తీసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు ఏనాడు కూడా పేద ప్రజల సంక్షేమ కోసం ఆలోచన చేయలేదన్నారు.