- సీఎం రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారు : లక్ష్మణ్
- ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నడు.. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర
- కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైటెన్షన్వైర్లా మారుతానంటూ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా నేషనల్ప్రెసిడెంట్లక్ష్మణ్ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైటెన్షన్వైర్తో ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వాల్సినంత అవసరమేంటి? సొంత ఎమ్మెల్యేలపైనే రేవంత్రెడ్డికి నమ్మకం లేదా? ఎందుకంత అభద్రతా భావంలో ఉన్నారు.
రాష్ట్రంలో తన పాలనే రెఫరెండంగా 14 సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్.. ఇప్పుడు చతికిలబడ్డారు. తనపై కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఓటమిని అంగీకరించినట్టుగానే ఉన్నాయి. దేశంలో కనుమరుగైతున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. కానీ దేశంలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని అవుతారని రేవంత్అనడం విడ్డూరంగా ఉంది” అని లక్ష్మణ్ అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే..
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని.. బీజేపీదే భవిష్యత్తు అని లక్ష్మణ్ అన్నారు. ‘‘ఓటమిని పసిగట్టే సీఎం రేవంత్రెడ్డి సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ను తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయనపై ఎవరు కుట్రలు పన్నుతున్నారో వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. 25 మంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ చెప్పిన మరుసటి రోజే.. బీఆర్ఎస్ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నాయి.
రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని మోదీ చరిష్మా, బీజేపీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే. కుటుంబ పాలన, అవినీతి, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, హిందూ వ్యతిరేక నిర్ణయాలతో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
త్వరలో వికసిత్ తెలంగాణ సంకల్ప పత్రం..
బీజేపీ ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేకపోతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. హరీశ్ రావు బీజేపీ ఏజెంట్ అని రేవంత్ అంటే.. రేవంతే బీజేపీ ఏజెంట్అని హరీశ్ అంటున్నారని పేర్కొన్నారు. ‘‘అవినీతి బీఆర్ఎస్ పోయి.. మళ్లీ అవినీతి కాంగ్రెస్అధికారంలోకి వచ్చిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారం కోల్పోయే సరికి తండ్రీ కొడుకులు నీళ్లలోంచి బయటపడిన చేపల్లా కొట్టుకుంటున్నారు.
అధికార దాహంతో బీఆర్ఎస్వ్యవహరిస్తుంటే, అధికార మదంతో కాంగ్రెస్వ్యవహరిస్తున్నది” అని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్ చేశారు.‘‘కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందనడానికి పెరుగుతున్న ఓటింగ్శాతమే నిదర్శనం. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు ఇస్తారు. వికసిత్ భారత్ లాగానే ‘వికసిత్తెలంగాణ’ సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు.