
పార్లమెంటు సభ్యుల గ్రూప్ ఫొటో సెషన్లో బీజేపీ ఎంపీ నరహరి అమీన్ స్పృహ తప్పి పడిపోయారు. పార్లమెంటు సభ్యులు పాత పార్లమెంటు భవనంలో చివరి ఫోటో సెషన్ కోసం సమావేశమయ్యారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ కుప్పకూలిన వెంటనే, ఇతర పార్లమెంట్ సభ్యులు అతనికి వెంటనే నీరు అందించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎంపీ కోలుకుని ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
ALSO READ: పార్లమెంట్ భవనం ఎదుట ఎంపీల గ్రూపు ఫొటో
పార్లమెంటు సభ్యులు పాత పార్లమెంటుకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా ఈరోజు (మంగళవారం) కొత్త పార్లమెంట్ భవనానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో, కొత్త పార్లమెంటు భవనం.. భారత పార్లమెంటు, ఎంపీలకు స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. (పాత) పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా పార్లమెంటు మొదటి సెషన్ను సభలో నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 18న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పార్లమెంటు కొత్త భవనాన్ని భారత పార్లమెంటు భవనంగా గుర్తించనున్నట్లు తెలిపింది.
#WATCH | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/goeqh9JxGN
— ANI (@ANI) September 19, 2023